కిలో మాంసానికి రూ. 260
కిలో కోడి రూ. 160
రేట్లతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు
కేసముద్రం ఏప్రిల్5: పండుగలు, పబ్బాలతో పాటు ఆదివారం వస్తే చాలు చాలా మంది నాన్ వెజ్ తిందామనుకుంటారు. నాన్ వెజ్లో ఎక్కువ మంది చికెన్ తినడానికే ఇష్టపడుతుంటా రు. కానీ 10 రోజులుగా ధరలు పెరుగడంతో సా మాన్య ప్రజలు చికెన్ తినాలంటేనే బెంబేలెత్తు తున్నారు. గడిచిన ఏడాది కాలం నుంచి ఎన్నడు లేని విధంగా కిలో చికెన్ ధర ఒక్క సారిగా రూ. 260కి చేరింది.. పది రోజుల క్రితం రూ.180 ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా రూ.80 పెరిగింది. కిలో కోడి ధర రూ.90 ఉండగా రూ.70కి పెరిగి రూ. 160కి చేరింది. దీంతో మాంసంప్రియుల జేబులకు చిల్లులు పడక తప్పడం లేదు. చికెన్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో కొనాలంటే వామ్మో అంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో గతేడా ది ఇదే నెలలో కేజీకి రూ.20కి అమ్ముడుపోని చి కెన్ ఏడాది తిరిగే లోపే ధరలు ఆకాశాన్నంటాయి.
డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకే..
ప్రస్తుతం వినియోగం పెరుగడం, ఎండలు మండిపోతుండడంతో కోళ్ల దిగుమతి తగ్గిపోవడం తో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబు తున్నారు. వడగాలుల తీవ్రత పెరుగడం వల్ల కోళ్లు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎం డాకాలంలో కోళ్ల పెంపకం చేపట్టడం కష్టంగా మా రడం, డిమాండ్కు సరిపడా పౌల్ట్రీ రైతులు కోళ్ల ఉత్పత్తిని నిలిపివేయడంతో ధరలు మరింత పెరి గే అవకాశం ఉంది.
చేపలపై సామాన్యుల ఆసక్తి..
చికెన్ ధర పెరుగడంతో మాంసప్రియులు చేప ల వైపు మళ్లుతున్నారు. కాళేశ్వరం నీరు చెరువుల కు చేరడం, నీరు సమృద్ధిగా ఉండడం, ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందించడంతో గ్రామా ల్లో చేపల లభ్యత అధికంగా ఉంది. నాణ్యమైన చేపలు గ్రామాల్లోనే అందుబాటులో ఉండడం, కిలో చేప ధర రూ. 120 నుంచి రూ.150 వరకు దొరుకుతుండడంతో సామాన్యులు అధికంగా చేప లు కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మధ్యప్రదేశ్లో టీకా తీసుకున్న 118 ఏళ్ల బామ్మ
మమత కాలు విరిగినా.. గుండె నిబ్బరంగానే ఉంది: జయా బచ్చన్