ఎమ్మెల్యే ఆత్రం సక్కు
జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్కాంబ్లేతో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్లు, ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ
నార్నూర్, ఏప్రిల్ 5: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉద్ఘాటించారు. సోమవారం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లేతో కలిసి నార్నూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు, తాడిహత్నూర్ గ్రామంలో ప్రహరీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందాలని తండాలు, గూడేలను పంచాయతీలుగా చేసి మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇల్లులేని నిరుపేదలను గుర్తించి రెండు పడకల ఇండ్లను ఇస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు ప్రభు త్వ పథకాలు నేరుగా చేరుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ అమృత్రావ్, ఐటీడీఏ డీఈ తానాజీ, ఏఈ సునీల్, సర్పంచ్లు బానోత్ గజానంద్నాయక్, రాథోడ్ మధుకర్, ఉప సర్పంచులు విష్ణు, సీహెచ్ మహేందర్, ఎంపీటీసీ కే పరమేశ్వర్, సహకార సంఘం వైస్ చైర్మన్ ఆడే సురేశ్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, నాయకులు రాథోడ్ సుభాశ్, ఆడే శ్రీరామ్, మెస్రం మానిక్రావ్, మోతే రాజన్న, సత్తార్ పాల్గొన్నారు.