గువాహటి: ఛత్తీస్గఢ్లో భద్రతాబలగాలపై నక్సల్స్ దాడి ఘటన విచారకరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం అసోంలో పర్యటిస్తున్న ఆయన ఈ ఉదయం గువాహటిలో మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ దాడిలో గాయపడిన ఏడుగురు సిబ్బందిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని రాయ్పూర్ ఆస్పత్రి వైద్యులు చెప్పినట్లు ఆయన తెలిపారు. గల్లంతైన 21 మంది భద్రతాసిబ్బంది కోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని, పరిస్థితిని పర్యవేక్షించడం కోసం సీఆర్పీఎఫ్ డీజీని పంపుతున్నట్లు చెప్పారని భూపేష్ భగేల్ వెల్లడించారు. తాను కూడా ఈ సాయంత్రానికి ఛత్తీస్గఢ్కు వెళ్లనున్నట్లు తెలిపారు. నక్సల్స్కు, భద్రతాసిబ్బందికి మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నక్సల్స్ వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుందన్నారు. ఏదేమైనా భద్రతాసిబ్బంది బలిదానాలు మాత్రం వృథా కాబోవన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?