హుస్నాబాద్, ఏప్రిల్ 2 :నిరంతర సాధన చేయడంతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటామని ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో 45రోజులుగా జరుగుతున్న పోటీపరీక్షల ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నదని, ఇందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన యువత ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతోనే ఖర్చుకు వెనుకాడకుండా కార్పొరేట్ స్థాయిలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత శిక్షణను 66రోజుల పాటు నిర్వహించాలని ప్రారంభంలో నిర్ణయించామని, శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోరిక మేరకు మరిన్ని రోజులు పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పలు ప్రారంభోత్సవాలు..
హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో ఏర్పాటు చేసిన మైమార్ట్ సూపర్మార్కెట్తో పాటు అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన నాగార్జున డెయిరీ పార్లర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య కార్మికుడు గడిపె సారయ్యతో పాటు చిగురుమామిడి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమాచారితో పాటు పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ రజితవెంకట్, వైస్చైర్పర్సన్ అనితారెడ్డి, అక్కన్నపేట ఎంపీపీ లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్య మంగశ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ అశోక్బాబు, మాజీ చైర్మన్ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, కౌన్సిలర్లు రమారవీందర్, బొజ్జ హరీశ్, కో-ఆప్షన్ సభ్యులు అయిలేని శంకర్రెడ్డి, ఎండీ అయూబ్, కాశవేని లలిత, నాయకులు చిట్టి గోపాల్రెడ్డి, గోనెల మధుకర్, విజయభాస్కర్, భాషవేని రాజయ్య, రమణారెడ్డి ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
సుయెజ్ కాలువ నష్టం.. 100 కోట్ల డాలర్ల పరిహారం కోరుతున్న ఈజిప్ట్
కొవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఫ్రాన్స్లో లాక్డౌన్
అమెరికా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం.. ఇవే జో బైడెన్ ప్రణాళికలు
పాకిస్తాన్లో కరోనా టీకాలు దొంగతనం
ఆల్ ఫూల్స్ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు