చండీగఢ్: జాతీయస్థాయి యువ రెజ్లర్ రితికా ఫోగట్(17) ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ రెజ్లర్లు గీత, బబితా ఫోగట్ కుటుంబానికి చెందిన రితికా బలవన్మరణానికి పాల్పడడంతో క్రీడా ప్రపంచం షా క్కు గురైంది. ఓ టోర్నమెంట్ ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోవడంతో 17 ఏండ్ల రితిక తీవ్ర మనస్తాపం చెందినట్టు పోలీసులు తెలిపారు. ద్రోణాచార్య అవార్డీ, తన బంధువు అయిన మహవీర్ సింగ్ ఫోగట్ వద్ద రాజస్థాన్ చర్ఖీదాద్రి జిల్లా బాలాలీలో రితిక శిక్షణ తీసుకుంటున్నది. మార్చి 14న జరిగిన టోర్నీ ఫైనల్లో పరాజయం చెందింది. దీంతో మనస్తాపం చెంది మహవీర్ ఇంట్లోనే 15వ తేదీ రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.