జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా రప్ఫాడించే అద్భుతమైన నటుడు ఆయన. అందుకే ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2018లో ‘అరవింద సమేత’ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు జూనియర్. ఈయన కెరీర్లో తొలిసారి రెండేళ్లు ఖాళీగా వెళ్లిపోయాయి. 2019, 2020 అంతా రాజమౌళికే రాసిచ్చేశాడు తారక్. మధ్యలో కరోనా కూడా వచ్చింది. లేదంటే 2020లోనే సినిమా వచ్చుండేది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే ఇప్పుడు మిగిలిన హీరోలకు పిచ్చెక్కిపోతుంది.
వరసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అవుతూ పిచ్చెక్కిస్తున్నాడు జూనియర్. ప్రస్తుతం రాజమౌళితో ‘ట్రిపుల్ ఆర్’ చేస్తున్నాడు జూనియర్. ఈ సినిమా షూటింగ్ జులైలోపు పూర్తి కానుంది. ఈ సినిమా అక్టోబర్ 13న దసరా సందర్భంగా విడుదల కానుంది. మరోవైపు ‘ట్రిపుల్ ఆర్’ అలా ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ లైన్ లోకి రానున్నాడు. ఈ సినిమా కూడా త్వరగానే పూర్తి చేయాలని చూస్తున్నాడు తారక్. 2022 సమ్మర్ విడుదలకు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. పూర్తి పొలిటికల్ సెటైరికల్ సినిమాగా రూపొందబోయే ఈ చిత్రానికి ‘అయిననూ పోయిరావలె హస్తిన’కు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దాంతో పాటు ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.
ఈ రెండు సినిమాలతో పాటు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ పాన్ ఇండియన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు తారక్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. ఇన్నాళ్లూ ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ భార్య ఎన్టీఆర్ సినిమాను ఖరారు చేసింది. ప్రభాస్ సలార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలిపింది ఈమె. దాంతో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తర్వాత కొరటాల శివ కూడా జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇలా ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలు.. నలుగురు క్రేజీ డైరెక్టర్స్ను లైన్లో ఉంచాడు యంగ్ టైగర్. అందుకే మిగిలిన హీరోలు ఈయన లైనప్ చూసి పిచ్చెక్కిపోతున్నారంతే.