మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్బీ స్టేడియంలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. 17న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 22న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.