అహ్మదాబాద్ : గుజరాత్లోని వదోదరకు చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. బాజ్వాలోని ఆమ్రపాలి సొసైటీలో తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం అతడు ఉరివేసుకుని మరణించాడు. తన భార్య, అత్తింటి వారే తన చావుకు బాధ్యులని పేర్కొంటూ ఆయన రెండు పేజీల సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. బాధితుడిని శిశిర్ దర్జీగా గుర్తించారు. శిశిర్ ఇంటికి వెళ్లిన బంధువులు ఎంతసేపటికీ అతను తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసు బృందం అక్కడికి చేరుకుని బలవంతంగా తలుపురు తెరవగా శిశిర్ దర్జీ సీలింగ్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. తనను భార్య అత్తింటి వారు వేధింపులకు గురిచేసేవారని రూమ్లో ఉంచిన సూసైడ్ నోట్లో రాసిఉంది. ఎల్ఎల్బీ చదివిన శిశిర్ దర్జీ ఎన్నడూ న్యాయవాద వృత్తిని చేపట్టలేని, మంజాల్పూర్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాడని స్ధానికులు తెలిపారు. బాధితుడికి ఎనిమిదేండ్ల కిందట మోనిక అనే మహిళతో వివాహమైంది. పదకొండు నెలల కిందట ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె తిరిగి శిశిర్ ఇంటికి చేరుకోలేదు. బాధితుడు మొబైల్ ఫోన్ను ట్రేస్ చేసి వివరాలు రాబడతామని దర్యాప్తులో వెల్లడైన విషయాల ఆధారంగా చర్యలు చేపడతామని స్ధానిక పోలీస్ అధికారి డీజే లింబోలా తెలిపారు.