అమరావతి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. రెండురోజులు రాయదుర్గంలో ఉండవద్దని అధికారులు ఆయనకు సూచించారు. స్థానికంగా ఓటుహక్కు లేకపోవడంతో అధికారులు కాల్వ శ్రీనివాసులుకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. స్థానికంగా ఓటుహక్కు లేనివారు ఎన్నికలు ముగిసేంత వరకు మున్సిపాలిటీ పరిధిలో ఉండవద్దని సూచించారు.
రాష్ట్రంలో మొత్తం 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో పోలింగ్ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ కేసులో రాష్ట్ర పురపాలక శాఖ మంగళవారం హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తున్నది.