భూసేకరణ పనులు పూర్తి చేయాలి

భువనగిరి, నమస్తేతెలంగాణ: ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశమై భూసేకరణ పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. ప్యాకేజీ-15 మెయిన్ కెనాల్కు సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిజర్వాయర్ నింపడానికి అవసరమైన అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వెంకటాపూర్, ముల్కలపల్లితండా, వీరారెడ్డిపల్లి, తుర్కపల్లిలో మిగిలిపోయిన భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ-16కు సంబంధించి బస్వాపూర్ రిజర్వాయర్ పనుల్లో భాగంగా అక్కడక్కడ మిగిలిపోయిన రాయగిరి, సూరేపల్లి, బొల్లేపల్లిలో భూసేకరణను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముంపునకు గురయ్యే లక్ష్మీనాయకునితండా, స్వాములనాయకునితండాలో పునరావాస చర్యలు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో భూపాల్రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈలు హైదర్ఖాన్, అశోక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు