బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించాలి

- - కలెక్టర్ అనితారామచంద్రన్ ,డీఈవో చైతన్యజైని
బొమ్మలరామారం : బాలికల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని యాదాద్రిభువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. శుక్రవారం మండలంలోని మల్యాల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని హాజరై మాట్లాడారు. బాలికలు మనోధైర్యంతో పాటు కరాటే వంటి ఆత్మరక్షణ శిక్షణ నేర్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. నేడు సమాజంలో బాలికలపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రతి ఒక్కరూ కరాటే, మార్షల్ ఆర్ట్స్పై బాలికలు పట్టు సాధించాలన్నారు. సమస్యలను ఎదుర్కొనేందుకు ధైర్యంగా నిలబడాలన్నారు. ఆత్మవిశ్వాసంతో చదువుల్లో ప్రతిభను చాటేందుకు బాలికలు పోటీపడాలన్నారు. పట్టుదలతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో చైతన్యజైని, మండల ప్రత్యేకాధికారి జ్యోతికుమార్, తహసీల్దార్ పద్మసుందరి, ఇన్చార్జి ఎంపీడీవో శేషాద్రి, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఉపేంద్ర, కెజిబివి ప్రిన్సిపాల్ మాధవి, సర్పంచ్ శ్రీను , ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్