తుర్కపల్లి, జూలై27: శ్రమదానంలో ప్రజలు భాగస్వాములై పైగామాన్ని అభివృద్ధి చేసుకోవా లని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిని మంగళవారం కలెక్టర్ సందర్శించి గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు గ్రామంలో చేపట్టిన శ్రమదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించారు. అదేవిధంగా హరితహారంలో భాగంగా మొక్కలు నా టారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సెన్సార్ సోలార్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు గ్రామస్తులతో కలిసి గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. గ్రామాభివృద్ధిలో మహిళలు, యువత కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు వారి నైపుణ్యం ఆధారంగా వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామంలో త్వరలోనే నిరుద్యోగ యువతకు మొబైల్ రిపేరింగ్, మహిళలకు టైలరింగ్, మగ్గంవర్కు, కంప్యూటర్ రంగానికి సంబంధించి డీటీ పీ, ఎంఎస్ఆఫీస్, ఎలక్ట్రికల్ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపా రు. గ్రామంలో ధరణికి సంబంధించిన సమస్యలుంటే 15 రోజుల్లో పరిష్కరించాలని తహసీల్దార్కు సూచించారు. అంతకుముందు కలెక్టర్ నర్సరీని పరిశీలించారు. గ్రామంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, సర్పంచ్ పోగు ల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఎంపీడీవో ఉమాదేవి, ఉప సర్పంచ్ మధు, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మండల కేం ద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె అదనపు కలెక్టర్ దీపక్తివారీతో కలి సి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో రికార్డులను పరిశీలించి, కొవిడ్ వ్యాక్సినేషన్ తీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖాన స్టోరూం లో లీకేజీని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, దవాఖాన కాంపౌండ్వాల్ గేటును వారం రోజుల్లోగా ఏర్పాటు చేయడంతోపాటు కలుపు మొక్కలను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. గత వేసవిలో చేపట్టిన పారిశుధ్య పనులపై ఖర్చులకు సంబంధించిన రికార్డులతో సహ కలెక్టరేట్కు హాజరు కావాలని పీహెచ్సీ వైద్యాధికారి చంద్రారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీలారవీందర్, సర్పం చ్ వనితాశ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటా ఇన్నో వేటర్ దరఖాస్తుల గడువు పొడిగింపు
నూతన ఆవిష్కరణలతో సృజనాత్మకతను వెలికితీసే ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ దరఖాస్తుల గడువును ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఇన్నోవేటర్ గోడ పత్రికను ఆవిష్కరించి, ఇన్నోవేటర్ను ప్రదర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, డీఈవో చైతన్యజైనీ, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.