పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు g అద్దంలా సీసీ రోడ్లు, వీధులు
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లెప్రకృతివనంలోని మొక్కలు
రూ. కోటి 20 లక్షలతో అభివృద్ధి పనులు
భువనగిరి అర్బన్, జూలై20:టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మం డలంలోని చందుపట్ల గ్రామం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది. సర్పంచ్, పాలకవర్గ సభ్యులు పల్లెప్రగతి నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రోడ్లు అద్దంలా మెరుస్తుండగా, వీధులు పరిశుభ్రతతో కనిపిస్తున్నాయి. పల్లెప్రకృతివనం చూపరులను ఆకట్టుకుంటున్నది. రైతువేదిక భవనం, డంపింగ్యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు గ్రామానికి వన్నె తెచ్చాయి. గ్రామంలో ఇప్పటివరకు రూ.కోటి 20 లక్షలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో గ్రామానికి మహర్దశ పట్టింది.
పరిశుభ్రంగా రోడ్లు..
మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో ఉండే చందుపట్లలో అడుగుపెట్టగానే గ్రామంలోని రోడ్లు పరిశుభ్రంగా దర్శనమిస్తాయి. గ్రామంలో 3000 వేలకు పైగా జనాభా ఉండగా, 1980 మంది ఓటర్లు ఉ న్నారు. ఇక్కడ మిషన్భగీరథతో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందుతున్నది. ప్రతిరోజూ ఇంటింటికీ ట్రాక్టర్ను తిప్పుతూ గ్రామపంచాయతీ సిబ్బంది సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో ని డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, అండర్గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటుతో పరిసరాలు శుభ్రంగా మారి సీజనల్ వ్యాధుల బెడద లేకుండా పోయింది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించగా నూతనంగా కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరగనుంది. అన్ని హంగులతో వైకుంఠధామ నిర్మాణం చేపట్టారు. పల్లెప్రకృతివనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. అం దులో 16 రకాల పూలు, పండ్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పల్లెప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో పాడుబడిన ఇండ్లను తొలగించడం, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలు, థర్డ్లైన్ విద్యుత్ వైర్ ఏర్పాటు చేశారు.
అభివృద్ధి పనులు ఇలా…
గ్రామంలో రూ.22 లక్షలతో రైతువేదిక భవన నిర్మా ణం, రూ.20 లక్షలతో కుమ్మరిగూడెంలో బీటీ రోడ్లు , రూ.9.70 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ.9లక్షలతో ట్రాక్టర్, ట్యాలీ, ట్యాం కర్ను కొనుగోలు చేశారు. సుమారు రూ.22 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రూ.31లక్షలతో సీసీ రోడ్ల పనులు రూ.4లక్షలతో హైస్కూల్కు కలర్, మరమ్మతుల పనులు చేపట్టారు.