వానకాలం సీజన్లో జోరందుకున్న పంటల సాగు
వరి తర్వాత అత్యధికంగా పత్తి పంట సాగుపైనే రైతుల ఆసక్తి
1.74లక్షల ఎకరాలకు ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పూర్తయిన పత్తి పంట
నీటి లభ్యత తక్కువగా ఉన్నచోట పత్తి సాగు వైపు రైతుల మొగ్గు
యాదాద్రి భువనగిరి, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం పంటల సాగు జోరందుకుంది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 4.42 లక్షల ఎకరాలుగా జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేయగా.. ఇప్పటికే 3.25 లక్షల ఎకరాల్లో పంటల సాగు పూర్తయ్యింది. అయితే వరి తర్వాత అధికశాతం రైతులు పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. మూసీ, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరి పంటను రైతులు సాగు చేసుకుంటుండగా.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తిని సాగు చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 1.74లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా..ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పత్తి సాగుపూర్తైంది. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా దళారుల బెడద లేకుండా పత్తిని కొనుగోలు చేస్తుండటం.. మద్దతు ధర లభిస్తుండటం వంటి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో పత్తిని సాగు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని రైతాంగం భావిస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో వరి సాగు తర్వాత రెండో ప్రధాన పంటగా రైతులు పత్తి పంటను సాగు చేస్తు న్నారు. నీటి అవసరం అంతగా లేకపోవ డం.. లాభాలు బాగుండటంతో రైతులు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తి సా గుపైనే దృష్టి సారిస్తున్నారు. పంటల సాగుకు ప్రభుత్వం ముందుగానే పెట్టుబడి సాయాన్ని అందజేయడంతోపాటు పత్తిసాగుకు అనుకూ ల పరిస్థితులను కల్పించింది. పలు ప్రాంతా ల్లో నేలలు పత్తిసాగుకే అనుకూలంగా ఉండ టంతో కొన్ని గ్రామాలు పూర్తిగా పత్తి పంట ను సాగు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
రెండో ప్రధాన పంట పత్తియే..
జిల్లాలో మూసీనది, గోదావరి జలాలు సమృద్ధిగా ఉండటంతో వానకాలం సాగుకు ఎంతో ఉత్సాహంగా రైతులు ఉపక్రమించారు. అయితే రైతులు మూసీనది పరీవాహక ప్రాం తం వెంట వరినే సాగు చేస్తుండటంతో జిల్లా లో అత్యధికంగా వరి పంటనే సాగుకానుంది. జిల్లావ్యాప్తంగా 1.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా ఉండగా.. ఇప్పటికే 1.20 లక్షల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఇం కా లక్ష ఎకరాల్లో నాటేందుకు నారుమడి సిద్ధంగా ఉంది. దీంతో అంచనాలకు మించి వరి సాగు కానుంది. అయితే రైతుల్లో వచ్చిన చైతన్యం ఫలితంగా నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను సైతం ఎక్కువగా సా గు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో రైతులు పత్తిపంటకు కూడా అధిక ప్రాధాన్యమిస్తు న్నారు. గతేడాది పత్తిపంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు ప్రభుత్వమే సీసీఐ ద్వా రా కొనుగోళ్లు జరపడంతో ఆశించిన ధర పొందిన రైతులు ఈసారి కూడా పత్తి పంటవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో 1.74 లక్షల ఎకరాలకుగానూ ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పత్తి పంటల సాగు పూర్తయ్యింది. అక్కడక్కడా మొలకెత్తిన పంటలో ఇప్పటికే కలుపు సైతం తీస్తున్నారు. విత్తనం మొలకెత్తని రైతులు మరోసారి విత్త నం వేసే పనిలో నిమగ్నమయ్యారు.
వరి సాగుకు దూరంగా సికిందర్నగర్
జిల్లాలోని మోటకొండూరు మండలంలో ఉన్న సికిందర్నగర్ గ్రామ రైతులది వినూత్న శైలి. గ్రామంలోని రైతులంతా వ్యవసాయాధారంగానే జీవిస్తున్నారు. అయితే ఊరంతా ఒకే బాట పట్టి అనాదిగా పత్తి పంటనే సాగు చేస్తూ వస్తున్నారు. సాగు నీటి వనరులు అం తగా లేకపోవడం..చౌట భూములు ఉన్న కారణంగా ఈ ప్రాంత రైతుల ఆలోచనాధోరణిలో మార్పు వచ్చింది. వరి పంటకు పూర్తి గా స్వస్తి పలికి లాభదాయకమైన పత్తినే సాగు చేస్తూ వస్తున్నారు. గతేడాది వానకాలంలో ఈ గ్రామ పరిధిలో 2,100 ఎకరాల్లో పత్తిని సాగు చేస్తే.. వరి పంటను కేవలం పది ఎకరాల్లోనే సాగు చేశారు. అలాగే ఈసారి కూడా వరిసాగు 12 ఎకరాలకు మించే పరిస్థితి లేకపోగా..పత్తి మాత్రం 1,9 50 ఎకరాల్లో సాగు కానుంది. పత్తి కంటే లాభదాయకమైన పం ట మరొకటి లేదని, ఈ భావనతోనే ఈ పం టనే సాగు చేస్తున్నామని గ్రామ రైతులు పేర్కొంటున్నారు. ఇక్కడి రైతుల స్ఫూర్తితో పరిసర ప్రాంత రైతులు కూడా వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించి పత్తి సాగుపైనే మక్కువ చూపుతున్నారు.