యాదాద్రి, జూలై25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత పూజల కోలాహ లం ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే మొదలైంది. నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హార తి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శ న హోమం ద్వారా స్వామివారిని కొలిచారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యతిరు కల్యాణంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన స్వామివారిని ఆరాధి స్తూ సుమారు గంటన్నరకుపైగా కల్యాణతంతు జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడుసేవలు నిర్వహించారు. మండపంలోని అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం చేశారు. అమ్మవారికి కుం కుమార్చనలు నిర్వహించారు. వారాంతపు సెల వు దినం కావడంతో యాదాద్రీశుడిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో బోనాల ఉత్సవా లు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
స్వామివారి ఖజానాకు రూ.12,31,849 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.12,31,849 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,56,924, రూ.100 దర్శనంతో రూ.8,600, వీఐపీ దర్శనాలతో రూ. 1,05,000, నిత్యకైంకర్యాలతో రూ.1,400, సుప్రభాతం ద్వారా రూ.1,100, క్యారీబ్యాగులతో రూ.3,575, సత్యనారాయణస్వామి వ్రతా లతో రూ.25,000, కల్యాణకట్టతో రూ.19, 600, ప్రసాద విక్రయంతో రూ. 5,28,315, శాశ్వతపూజల ద్వారా రూ. 6,000, వాహన పూజలతో రూ.13,200, టోల్గేట్తో రూ. 2,100, అన్నదాన విరాళంతో 46,425, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,23,680, యాదరుషి నిలయంతో రూ. 66,280, పాతగుట్టతో రూ. 28,050, టెంకాయల విక్రయంతో రూ.63, 000, ఇతర విభాగాల ద్వారా రూ. 33,600 తో కలుపుకొని రూ. 12,31,849 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
స్వామివారికి బంగారు లక్ష్మీహారం బహూకరణ
హైదరాబాద్లోని విద్యానగర్కు చెందిన డి.లక్ష్మణ్జీ జయంతి దంపతులు స్వామి, అమ్మవార్లకు బంగారు ఆభరణాన్ని బహూకరించారు. 28. 330 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని ఆలయ అర్చకులకు ఆదివారం అందజేశారు.