యాదాద్రి, ఆగస్టు 4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి లో బుధవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వి విధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు స్వామి వారి బా లాలయంలో అతరంగికంగా నిర్వహించారు. పాంచరాత్రాగ మ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలు లక్ష పుష్పార్చన పూజలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి రోజున యాదాద్రి క్షేత్రం లో స్వామిని లక్ష పుష్పాలతో అర్చనలు జరుపడం ఆలయ సం ప్రదాయం. ఈ లక్ష పుష్పార్చన పూజల్లో దేవస్థాన ప్రధానా ర్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చక బృం దం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శాస్ర్తోక్తంగా నిత్య కైంకర్యాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి నిత్య కైంకర్యాలు శాస్ర్తో క్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చ కులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధ నలు జరిపారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పం చామృతాలలో అభిషేకించి, తులసి అర్చనలు చేపట్టారు. లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన హోమం, శ్రీలక్ష్మీ నరసింహుల నిత్య తిరుకల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన శివాలయంలో నిత్యారాధనలు శైవ సం ప్రదాయంగా జరిగాయి. అమ్మ వారికి కుంకుమార్చనలు నిర్వ హించారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలలో భక్తులు పాల్గొని వ్రతాలచరించారు.
స్వామిని దర్శించుకున్న ఇంటలిజెన్స్ ఎస్పీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కరీంనగర్ ఇంటలిజె న్స్ ఎస్పీ రాజమహేందర్ నాయక్ కుటుంబసమేతంగా దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చ కులు, అధికారులు ఆయనకు వేద ఆశీర్వచనం, స్వామి వారి ప్రసాదం అందజేశారు.
ఖజానాకు రూ. 5,45,826 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 5,45,826 ఆదాయం వచ్చినట్లు ఆల య ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.55,332, రూ. 100 దర్శనంతో రూ.28,000, నిత్య కైంకర్యాలతో రూ. 3,716, క్యారీబ్యాగులతో రూ.1,100, సత్యనారాయణ వ్రతా ల ద్వారా రూ.10,500, కల్యాణకట్టతో రూ.10,000, ప్రసాద విక్రయంతో రూ.2,72,290, శాశ్వత పూజల ద్వారా రూ. 23,232, వాహన పూజలతో రూ. 5,600, టోల్గేట్తో రూ. 680, అన్నదాన విరాళంతో 316, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 80,400, యాదరుషి నిలయంతో రూ. 15,650, పాత గుట్టతో రూ.5,960, టెంకాయల విక్రయాలతో రూ. 33,000 తో మొత్తం కలుపుకుని రూ. 5,45,826 ఆదాయం సమకూ రినట్లు ఆమె తెలిపారు.