యాదాద్రి, సెప్టెంబర్13 : యాదాద్రి ఆలయంలో విద్యుద్దీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేకంగా తయారు చేసిన విద్యుద్దీపాలను గత జూన్లో నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో శాశ్వతంగా వైరింగ్ వేసి బిగింపు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం పనులు తుదిదశకు చేరాయి. ప్రధానాలయం ప్రథమ, ద్వితీయ ప్రాకారాలు, యాలీ పిల్లర్లకు లైటింగ్ బిగించారు. దీంతోపాటు గర్భాలయ ముఖ మండపం, దీపకన్నెలు, ఆళ్వార్లు, కాకతీయ పిల్లర్లకు లైటింగ్ అమర్చారు. గర్భాలయానికి గల ప్రహ్లాద ఘట్టాలు, జయవిజయులు, ఉపాలయాలు, క్యూలైన్లలో విద్యుద్దీపాలను బిగించారు. దీంతో స్వామివారి ముఖమండపం పూర్తిగా స్వర్ణవర్ణంతో ధగధగలాడుతున్నది.