మోత్కూరు, జూలై 20: సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన జిల్లాలోని వాసాలమర్రి తరహాలోనే ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వాసాలమర్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి రూ.25 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటించారన్నారు. ఈ మేరకు నిధులు గ్రామ పంచాయతీలకు జమచేసిన నేపథ్యంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలతో సమీక్ష నిర్వహించారు. నూతన పనుల నిర్వాహణ కోసం నిధులను వినియోగించుకోవాలన్నారు. మౌళిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చి నిధులు ఖర్చు చేయాలన్నారు. సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలన్నారు.
కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మీమారయ్య, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, సోంమల్లు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రమేశ్, బొడ్డుపల్లి కల్యాణ్చక్రవర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మందర్రెడ్డి, తహసీల్దార్ షేక్ ఆహ్మద్, ఎంపీడీవో మనోహర్రెడ్డి, పంచాయతీరాజ్ డీఈ హేమంత్, ఏఈలు శ్రీనివాస్, వెంకటేశ్, సంతోష్రెడ్డి, అమర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేశ్, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను, విష్ణు, నాయకులు సంతోష్రెడ్డి, రచ్చలక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ రాంపాక నాగయ్య పాల్గొన్నారు.
అంచెలంచెలుగా గ్రామాల అభివృద్ధి
అడ్డగూడూరు, జూలై 20 : గ్రామాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 17 గ్రామాల ప్రజాప్రతినిధులు , మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అయన మాట్లాడారు. గ్రామాల్లో ఏసమస్య ఉన్నా సత్వరమే పరిష్కరించేందు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు నిత్యం గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి,రైతుబంధు సమితి మండల కోఆర్డిటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి పాల్గొన్నారు.