ఆలేరు టౌన్, జూలై 16 : మెరుగైన రవాణా వ్యవస్థతోనే అభి వృద్ధి సాధ్యమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీ తామహేందర్రెడ్డి పేర్కొన్నారు.ఆలేరు- జీడికల్ జంక్షన్ల మధ్య అండర్పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 29కోట్ల70 లక్షల నిధులను మంజూరు చేయగా శుక్రవారం అండర్పాస్ నిర్మాణ పనులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి (163)లోని ఆలేరు-వంగపల్లి మరియు వంగపల్లి- మోటకొండూర్ మధ్య అండర్పాస్లు నిర్మించాలని పలుమార్లు కేంద్రం దృష్టికి , నేష నల్ హైవే అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింద న్నారు. మంత్రి హరీశ్రావుతో కలిసి వినతిపత్రం అందించడం జరిగిందన్నారు.ఈ విషయమై అప్పటి భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా కృషి చేశారన్నారు. పనులు ఎల్ అండ్టీకి అప్పగించగా వారు నిర్లక్ష్యం వహించారన్నారు. అలాగే వం గపల్లి- మోటకొండూర్ల మధ్య కూడా అండర్పాస్ నిర్మాణ ప నులకు నిధులు మంజూరు కావాల్సి ఉందన్నా రు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ నాలుగు నెలల్లో అండర్పాస్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమి నేటి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, మార్కెట్ చైర్మన్ రవీందర్గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాద వి, మండల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీని వాస్, వెంకటేశ్, కౌన్సిలర్లు రాములు, దయామ ణి, జే. శ్రీకాంత్, కే. శ్రీకాంత్, నర్సింహులు, పీ ఏసీఎస్ చైర్మన్ మల్లేశం, వైస్ చైర్మన్ చంద్రకళ, రాజేశ్, మురళి, సంతోష్, రవి, మల్లేశ్, శివమ ల్లు, కృష్ణ, శ్రవణ్, అనిల్, శ్రీకాంత్నాయక్, మ హేందర్, నాగరాజు, ఫయాజ్ పాల్గొన్నారు.
వర్షపు నీటికి శాశ్వత పరిష్కారం చూపించాలి
యాదగిరిగుట్టలో ఊర చెరువు నుంచి నీరు క్రిందికి రావడం, గుట్టలపై నుంచి నుంచి వచ్చే వర్షపు నీరు పట్టణంలోని సబ్రిజిష్ర్టార్ కా ర్యాలయం నుంచి యాదగిరిగుట్ట ఎస్సీ కాలనీ వైపు వెళ్తున్నా యని, ఇలా కాకుండా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రజాప్రతిని ధులతో కలిసి సబ్రిజిష్ర్టార్ కార్యాలయం వద్ద వాగును పరి శీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వర్షం వచ్చిన సమయంలో ఈ వర్షపు నీరు ఎస్సీ కాలనీ వైపునకు వెళ్ల డం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వరద నీరు నేరుగా వంగపల్లి చెరువులోకి వెళ్లేవిధంగా సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికా రులకు సూచించారు. దీని కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో యాదాద్రి మున్సిపల్ చైర్మన్ సుధ, వైస్ చైర్మన్ రాజు, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు వెంకటయ్య, రైతు బంధు సమితి నాయకుడు వెం కటయ్య, అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.