ఆలేరుటౌన్, జూలై19: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వ రం లాంటిదని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మ హేందర్రెడ్డి అన్నారు. ఆలేరులో ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం పలువురు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని.. ఈ విష యాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా తెలుసుకుని వారి సంక్షేమం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సీఎం కేసీ ఆర్ పేదింటి ఆడపిల్లలకు మేనమామ అని కొనియాడారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్లు ఎర్ర దయామణి, జూకంటి శ్రీకంత్, కందుల శ్రీకాంత్, టీఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ మొ గులగాని మల్లేశం,తహసీల్దార్ గణేశ్నాయక్, వీఆర్వో లక్ష్మి, నే తలు బాలస్వామి, రవి, రాజేశ్, ఉప్పలయ్య, కృష్ణ, మహేశ్వరి, ఇందిర, ఫయాజ్,నాగరాజు, కల్యాణ్, షాబుద్దీన్ పాల్గొన్నారు.
టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణీ
సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సహకారంతో మండలంలో ఉచిత టైలరింగ్, కంప్యూటర్ శిక్ష ణ తీసుకున్న మహిళలకు యాదగిరిగుట్ట మండలం మాసాయి పేటలో సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భం గా ప్రభుత్వవిప్ మాట్లాడుతూ మహిళలు స్వయంఉపాధి పొం దడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. మహిళలు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమకు ఇష్టమైన రంగంలో నైపుణ్యం సాధించాలన్నారు. ఈ సందర్భంగా 60 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. మహిళలకు ఉచిత శిక్షణను అందిస్తున్న ఉదిత సంస్థను అభి నందించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీశైలం, జడ్పీటీసీ అను రాధ, సర్పంచ్ సువర్ణ, ఉదిత స్వచ్చంధ సంస్థ అధ్యక్షురాలు అలివేలు, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్స్ రమణవాసు, ఉప్పల య్య, జిల్లా సిటిజన్ సంస్థ మేనేజర్ మణికంఠ పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరంగా మారిందని సర్పంచ్ వంగాల శ్రీశైలం అన్నారు. సోమవారం మండలంలోని తూర్పుగూడానికి చెందిన పలువురికి కల్యాణ లక్ష్మి చెక్కులు ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎ స్ గ్రామాధ్యక్షుడు నరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.