ఆలేరు టౌన్, జూలై20 : నేటి పోటీ ప్రపంచంలో డిగ్రీలు, పీజీ లు పూర్తి చేసిన వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. అలాగని ఇంజి నీరింగ్, వైద్య విద్యను చదువుదామంటే అది సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. ఏదో వి ధంగా ఇంజినీరింగ్ పూర్తి చేసినా ఉపాధి అవకాశాలు మృగ్యమ వుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎస్ఎస్సీ తరువాత నామమాత్రపు ఖర్చుతో పూర్తి చేయగలిగిన కోర్సుల్లో ప్రధానమైనవి ఐటీఐ కోర్సులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 2, ప్రైవేటు కళాశాలలు 12 ఉన్నాయి. 2021-22 విద్యా సం వత్సరానికి ఈ నెల 14 నుంచి ప్రవేశాలకు దరఖాస్తులను ఆ హ్వానిస్తున్నారు. చివరి తేదీ 28 వరకు ఉంది. ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్లి తమకు నచ్చి న కోర్సు, కళాశాలను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉం టుంది. www.iti.telengana.gov.in వెబ్సైట్లో దరఖా స్తు చేసుకోవాలి. 10వ తరగతి సాధించిన మార్కులు, రిజర్వే షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
రాష్ర్టాన్ని యూనిట్గా తీ సుకుని విద్యార్థుల ఆప్షన్ల ఎంపిక మెరకు ట్రేడ్లను కేటాయిస్తు ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకున్నవారు తమకు కావా ల్సిన ట్రేడ్ ఐటీఐలను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంపిక చేసుకోవా లి. ప్రస్తుతం ఈ ప్రక్రియ కీలకంగా మారింది. గతంలో ఐటీఐ ల వారీగా విద్యార్థులు తమకు కావాల్సిన ట్రైడ్లలో దరఖాస్తు చేసుకొని ప్రవేశాలు పొందేవారు. అప్పుడు ఒక్కో ఐటీఐలో చేరేందుకు కనీసం 10ట్రేడ్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్ర స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరుగు తుండడంతో ట్రేడ్ల ఎంపిక, సీట్ల కేటాయింపు కీలకంగా మారిం ది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్లో చేరేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎల్పీ సెట్ను నిర్వ హిస్తారు. ప్రతిభ చాటిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీ య సంవత్సరంలో చేరవచ్చు. తద్వారా నచ్చిన డిప్లొమా కో ర్సును పూర్తి చేయవచ్చు.
ఎలక్ట్రీషియన్ విభాగం
ఐటీఐ ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యత ఎలక్ట్రీషియన్ విభాగాని కి ఉంటుంది. ఎస్ఎస్సీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు శిక్షణ 2 సంవత్సరాలు. ఇందులో విద్యు త్ ఉత్పత్తి, హౌస్ వైరింగ్, విద్యుత్ సమస్యల పరిష్కారం వం టి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి విద్యు త్శాఖ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
డీజిల్ మెకానిక్
డీజిల్ మెకానిక్ విభాగం కాల పరిమితి ఒక సంవత్సరం ఉం టుంది. దీనికి ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో వివిధ వాహనాల యంత్రాల మరమ్మతులు, ప్రయోగ పరీక్షలు, వాటి పనితీరును వివరిస్తారు. ప్రైవేటు, ఆర్టీసీ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహనాల వినియోగం పెరగడంతో ఈ ట్రేడ్ డిమాండ్ పెరుగుతూ ఉంది.
టైలరింగ్ విభాగం
మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఏర్పాటు చేసిన టైల రింగ్ ట్రేడ్కు ఎంతో డిమాండ్ ఉంది. ఈ ట్రేడ్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇందులో ఎంబ్రాయిడరీ, దుస్తువులపై డిజైన్ల తయారీ, కుట్టడంలో శిక్షణ ఇస్తారు. ఫ్యాషన్ రంగంలో కొత్త ఒరవడులు రావడంతో కుట్లు, అల్లికలకు డిమాండ్ పెరిగింది.
డ్రాఫ్ట్మెన్ సివిల్
ఐటీఐలో డ్రాఫ్ట్మెన్ సివిల్కు డిమాండ్ బాగానే ఉంది. ఇది 2 సంవత్సరాల కోర్సు. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్వే శాఖ, రోడ్లు, భవనాలు, హౌసింగ్, మున్సిపాలిటీ తదితర శాఖల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ప్రైవేటుగా సివిల్ ఇం జినీర్గా కొనసాగిన ఉపాధి పొందవచ్చు.
మోటర్ మెకానిక్
ఆటో మొబైల్ రంగానికి ఉపయోగపడే ట్రేడ్ మోటర్ మెకాని క్. ఇందులో వాహనాలకు సంబంధించిన మరమ్మతులు, వా టి పనితీరును ఈ శిక్షణలో వివరిస్తారు. ఈ కోర్సు 2 సంవత్స రాలు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆర్టీసీ, వివిధ ప్రైవేటు ఆటో మొబైల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ఇంకా ఎన్నో ఉద్యోగాలు
ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు బోలెడు ఉన్నాయి. ఐటిఐ కళాశాలలను వివిధ రకాల ప్రైవేటు పరిశ్రమ లు, సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా ఎంపికలు ని ర్వహించి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుంది. అంతే కాకుండా రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండడంతో ఎంతో మంది కి ఉపాధి లభిస్తుంది. ఆర్టీసీ డిపోలు, యాదాద్రి థర్మల్ విద్యు త్ కేంద్రం, సిమెంట్ కర్మాగారాలు, ఫార్మా కంపెనీలు, గ్రానెట్ సంస్థలు, ఫార్మా సుటికల్, పీవీసీలతో పాటు సింగరేణి, రైల్వే తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. శిక్షణ తరువాత అప్రెంటీస్ షిప్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అప్రెంటీషిప్ సమయంలో స్కాలర్షిప్ ఇస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఐటీఐలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవా లి. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపా ధి దొరుకుతుంది. ఐటీఐలో చేరిన విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందజే స్తున్నాం. విద్యార్థులు ఎంచుకున్న విభాగాల్లో కష్టప డి చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి. గతంలో కంటే ప్రస్తు తం ఐటీఐలకు చాలా డిమాండ్ పెరిగింది.
– గుజ్జ హరికృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల