భువనగిరి అర్బన్, జూలై 25: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని యా దాద్రి భువనగిరి జిల్లా అధికారులను విద్యుత్శాఖ మంత్రి జగ దీశ్రెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జ డ్పీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను పూర్తిచేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గ్రా మాల్లో చేపట్టిన డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలను వంద శాతం నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, విద్యుత్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ విద్యుత్ సరఫ రాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారులు న ది ప్రవాహాన్ని అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్యయాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఆలేరు ఎ మ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఎమ్మె ల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యయాదవ్, టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
నిర్ణ్ణీత సమయంలో పూర్తి చేయాలి
జిల్లాలోని ప్రజా సమస్యలను అధి కారులు వెంటనే పరిష్కరించాలి. గ్రా మాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన డం పింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాల్లో చేపట్టిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. వర్షాలు సమృద్ధిగా కురు స్తున్న నేపథ్యంలో గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొ క్కలు నాటాలి. – జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి