భువనగిరి అర్బన్, జూన్ 24: ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని వివేరా హాటల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆప్ ఇండియా సహకారంతో జిల్లాలోని 116 మంది దివ్యాంగులకు రూ.43, 11,787 లక్షలతో వాహనాలను అందజేశారు. ఇందులో మూడు చక్రాల మోట రైజ్డ్ ట్రై సైకిల్ 72, సంక కర్రలు 14, రెండుచక్రాల బండ్లు 16, ట్రాలీ కిట్ 1, హియరింగ్ ఎయిడ్ బ్యాటరీలు 6, మూడు చక్రాల బండ్లు 16, వాకిం గ్ స్టిక్స్ 2, స్మార్ట్ఫోన్ 1, రోలేటర్ 1 అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలను కలెక్టర్ పమేలాసత్పతి సమక్షంలో ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్నారు. అంగవైకల్యం కలిగిన వారికి ప్రత్యేక ఉపకరణాలు అందజేస్తుందన్నారు. అర్హులైన దివ్యాంగులు ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. దివ్యాంగులకు ఉపకరణాలు అందజేసిన ఇండియల్ ఆయిల్ కంపెణీ యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి, దివ్యాంగులశాఖ సూపరింటెండెంట్ శశికల, బాలల పరిరక్షణ జిల్లా అధికారి సైదులు, ఐఓసీఎల్ కంపెణీ డైరెక్టర్ ఆర్ఎస్ఎస్.రావు, చీఫ్ జనరల్ మేనేజర్ రామ్మోహన్, స్వామినాథన్, రాజేశ్ పాల్గొన్నారు.