యాదాద్రి అగ్రికల్చర్, జూలై 25: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో, ఎలా వాడాలో అన్ని వివరాలుపూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాల్సి ఉంటుంద ని, సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులను ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని భువనగిరి మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. వివిధ రకాల్లో వరి సాగు చేసే రైతులు కలుపు యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు పాటించాల్సిన సూచనలను వివరించారు.
వరి కలుపు యాజమాన్యం