తుర్కపల్లి: కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిలు అన్నారు. తుర్కపల్లి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కూరెళ్ల గురువయ్యచారి భార్య రాజమణి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కాగా టీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా సౌకర్యం పథకం కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును వారు గురువారం హైదరాబాద్లో మృతురాలి భర్త గురువయ్యకు అందజేశారు.
ఈసందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. చనిపోయిన కుటుంబాలకు పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో తుర్కపల్లి మాజీ ఎంపీటీసీ తలారి శ్రీనివాస్, వెంకటాచారి ఉన్నారు.