ఒక్క పిలుపు ఎందరో పునర్జన్మకు కారణభూతమైంది. అంబులెన్స్ రూపంలో అందిన సాయం మరెందరో జీవితాలకు కొత్త ఊపిరిని అందించింది. ఏడాది క్రితం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన సంకల్పం..అత్యవసర వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న ఎందరో అభాగ్యులను ఆదుకోవచ్చని నిరూపించింది. తన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక్కొక్కటి చొప్పున అంబులెన్స్లను బహుమతిగా ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్తో బాధితుల ముంగిట వాలిపోతున్న ఈ అంబులెన్స్లు గర్భిణులకు భరోసా కల్పిస్తుండటంతోపాటు.. సాధారణ, కొవిడ్, అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తూ అపర సంజీవనులుగా నిలుస్తున్నాయి. గడిచిన ఏడాదిలో ఈ రెండు అంబులెన్స్లు దాదాపు 1600 మందికి పైగాప్రాణదానం చేయడం విశేషం.
యాదాద్రి భువనగిరి, జూలై 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ రెండో దశలో రోగుల సంఖ్య విపరీతంగా పెరుగగా అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించడంలో అందుబాటులో ఉన్న 108, ప్రైవేట్ అంబులెన్స్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అంబులెన్స్లకు తాకిడి పెరగడం.. డిమాండ్కు తగినట్లుగా లేకపోవడంతో సిబ్బందిపై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ యువనేత, మంత్రి కేటీఆర్ వినూత్న రీతిలో సామాజిక సేవకు శ్రీకారం చు ట్టారు. జూలై 24న తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 108కు నూతన వాహనాలను కొనుగోలు చేసి తన పుట్టిన రోజు కానుకగా ఇవ్వాలని సూచించారు. దీనికి స్పందించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తన సొంత డబ్బులతో ఒక అంబులెన్స్ను కొనుగోలు చేసి బహుమతిగా అందించారు. అలాగే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రెండు అంబులెన్స్లను కొనుగోలు చేసి ఒక అంబులెన్స్ను నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి అందజేశారు. మరో అంబులెన్స్ను యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపు రం మండలాలకు సేవలందించేందుకు కేటాయించారు. ప్రస్తుతం ఈ రెండు అంబులెన్స్లు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్నాయి.
1600 మందికి పైగా వైద్య సేవలు..
భువనగిరి నియోజకవర్గంలో 2020 డిసెంబర్ 12 నుం చి ‘గిఫ్ట్ ఏ స్మైల్’ సేవలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ లో 85 మందికి, 2021 జనవరిలో 114 మందికి, ఫిబ్రవరిలో 112 మందికి, మార్చిలో 93 మందికి, ఏప్రిల్లో 95 మందికి, మేలో 127 మందికి, జూన్లో 104 మం దికి, జూలైలో 60 మందికి అంబులెన్స్ సేవలు అందా యి. ఇందులో 108 మంది కొవిడ్ బాధితులు ఉండ గా..100 మంది గర్భిణులు ఉన్నారు. చౌటుప్పల్ ఏరియాలో 2020 అక్టోబర్ 22 నుంచి అంబులెన్స్ సేవలు మొదలయ్యాయి. అక్టోబర్లో 32 మందికి, నవంబర్లో 101 మందికి, డిసెంబర్లో 82 మందికి, 2021 జనవరిలో 96 మందికి, ఫిబ్రవరిలో 77 మందికి, మార్చిలో 81 మందికి, ఏప్రిల్లో 104 మందికి, మేలో 108 మందికి, జూన్లో 97 మందికి, జూలైలో 42 మందికి సేవలు అందాయి. వెనుకబడ్డ సంస్థాన్ నారాయణపురం మండలంలోని గిరిజనులకు అంబులెన్స్ సేవలు మరింత ఉపయుక్తంగా మారాయి.
అంబులెన్స్లో అత్యాధునిక సేవలు..
‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ప్రభుత్వానికి అందించిన అంబులెన్స్లలో అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో క్షతగాత్రుల బీపీ, పల్స్, సాచురేషన్, ఆక్సిజన్ లెవల్స్, ఈసీజీ, టెంపరేచర్లను ఒకేసారి పరీక్షించేందుకు మల్టీ ప్యారామీటర్, సిరంజి పంప్, గ్లూకోజ్ మీటర్, డెలివరీ కిట్స్, రెండు ఆక్సిజన్ సిలిండర్లను అంబులెన్స్లో అందుబాటులో ఉంచారు. అలాగే సుశిక్షితులైన టెక్నీషియన్లను ప్రతి అంబులెన్స్కు నియమించారు.
తీరిన అత్యవసర కష్టాలు..
‘గిఫ్ట్ ఏ స్మైల్’ అంబులెన్స్లు వచ్చాక జిల్లా ప్రజలకు అత్యవసర వైద్యసేవల విషయంలో గతంలో తలెత్తిన కష్టాలు తీరాయి. రెండు, మూడు మండలాలకు కలిపి ఒక అంబులెన్స్ మాత్రమే అందుబాటులో ఉండడం, కొన్ని మండలాల్లో అసలే సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగేది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అంబులెన్స్లు చేరుకునే సరికి ఆలస్యం అ య్యేది. గతంలో జిల్లాలో పది అంబులెన్స్లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 12కు చేరింది. దీంతో అంబులెన్స్ల కొరత తీరినైట్లెంది. ఫోన్ చేసిన వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాహనం ఘటనాస్థలికి చేరుకుని, బాధితులను దవాఖానలకు తరలించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గర్భిణులు, రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఎందరో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎమ్మెల్యే శేఖర్రెడ్డి సమకూర్చిన 108 అంబులెన్స్తో ఎంతోమంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ఎంతో మందిని సకాలంలో దవాఖానలకు తరలించి వారి ప్రాణాలను కాపాడుతున్నది.
-ఈఎంఈ, మహేశ్కుమార్, జిల్లా ఇన్చార్జి
మంత్రి కేటీఆర్ విజన్ గొప్పది
మంత్రి కేటీఆర్ది గొప్ప మనసు. ఆయనకు ఉన్న విజన్ కూడా గొప్పది. పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు, ఆర్భాటాలకు తావు ఇవ్వకుండా ప్రజల కోసం అం బులెన్స్లను సమకూర్చాలని పిలుపునివ్వడం ఆయన మంచి మనసుకు నిదర్శ నం. భువనగిరి నియోజకవర్గ ప్రజలకు సేవలందించేందుకు అంబులెన్స్ను సమకూర్చా. ఈ వాహనం నిరంతరాయంగా సేవలు అందిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆలోచనలో నా వంతుగా పాలుపంచుకోవడం సంతృప్తిగా ఉంది.
మంత్రి కేటీఆర్ ఆలోచనకు హ్యాట్సాఫ్
చౌటుప్పల్, జూలై18: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తుంటారు. వారికి చిన్న కష్టం కూడా రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే వివిధ మండలాల ప్రజలతోపాటు, తండావాసులకు కూడా సకాలంలో వైద్యమందించేందుకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లోఉచితంగా అంబులెన్స్ సేవలందించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో నేను ఏర్పాటు చేసిన అంబులెన్స్ నిరంతరం ప్రజాసేవలో ఉండడం ఎంతో సంతృప్తి ఇస్తున్నది. ముఖ్యంగా మండల శివారు ప్రాంతాలైన తండాల్లోకి సరైన రవాణా సౌకర్యం ఉం డదు. రాత్రి సమయంలోనూ ఒక్క ఫోన్ కాల్తో ఆ తండాల నుంచి గర్భిణులను 108 వాహనంలో ప్రభుత్వ దవాఖానలకు తరలిస్తుండడ సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు.
-కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
రెండు మండలాల ప్రజలకు ప్రయోజనం
చౌటుప్పల్, జూలై18: గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమకూర్చిన అంబులెన్స్తో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నది. 24 గంటలపాటు ఈ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ అంబులెన్స్ ద్వారా రాత్రి సమయంలో ఎంతోమంది గర్భిణులకు సకాలంలో వైద్యం అందించడం జరిగింది. ముఖ్యంగా తండావాసులు చాలా లబ్ధిపొందారు. ఈ రెండు మండలాల ప్రజలకే కాకుండా అత్యవసర సమయంలో భూదాన్పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ మండలాల ప్రజలకు కూడా సేవలందిస్తున్నాం
-పవన్బాబు, ఈఎంటీ, చౌటుప్పల్
108 సేవలు వెలకట్టలేనివి
మాది సంస్థాన్ నారాయణపురం మండలం గాంధీనగర్ తండా. రాత్రి సమయంలో రవాణా సౌకర్యం అంతగా లేదు. నా భార్యకు రాత్రివేళ పురిటి నొప్పులొచ్చాయి. వెంటనే 108కి డయల్ చేయగానే కొద్ది సమ యంలో అంబులెన్స్ మా ఇంటికి వచ్చి ఆగింది. వెంటనే హైదరాబాద్లోని కోఠి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లం. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ నా భార్య ప్రాణాలను కాపాడింది.
సకాలంలో స్పందిస్తున్నాం
‘గిఫ్ట్ ఏ స్మైల్’లో ఎమ్మెల్యే సమకూర్చిన వాహనంలో అత్యాధునిక వసతులు ఉండడంతో ఏదైనా ప్రమాదమని ఫోన్ వచ్చిన వెంటనే సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను దవాఖానలకు తరలిస్తున్నాం. గత రెండు నెలలుగా రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల వంటి కారణాలతో వచ్చిన ఫోన్కాల్స్తో ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను దవాఖానలకు తరలించాం.
-వీరస్వామి, 108 పైలెట్, భువనగిరి
గర్భిణులకు ఉపయుక్తంగా అంబులెన్స్ సేవలు
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో బహూకరించిన 108 అంబులెన్స్తో భువనగిరి నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నాం. యాదగిరిగుట్ట, తుర్కపల్లితోపాటు పక్క మండలాలకెళ్లి ఇప్పటివరకు 771మందికి సేవలందించాం. ఇం దులో ఎక్కువగా కొవిడ్ బాధితులుండగా, 100 మందికిపైగా రోడ్డు ప్రమాదం, ఆత్మహత్యలు, గర్భిణులను దవాఖానలకు సకాలంలో తరలించి వారి ప్రాణాలను కాపాడగలిగాం. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు ఈ వాహనంతో ఎంతో ప్రయోజనం పొందుతున్నారు.
-రాంబాబు, ఈఎంటి, భువనగిరి
108 వాహనంలో పురుడుపోసిన సిబ్బంది
పట్టణానికి చెందిన పోలు స్రవంతి ఏడు నెలల గర్భి ణి. జూన్1వ తేదీన భువనగిరి ఏరియా దవాఖానకు వచ్చింది. పరీక్షించిన వైద్యు లు పుట్టబోయే బిడ్డకు నెలలు నిండకపోవడంతో బిడ్డ బరువు తక్కువగా ఉందని, సంబంధిత వైద్య సౌకర్యాలు స్థానికంగా లేకపోవడంతో హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో స్రవంతిని ఆమె కుటుంబీకులు గిఫ్ట్ ఏ స్మైల్ 108 అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకెళ్తుండగా ఉప్పల్ సమీపంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్లో అన్ని వసతులు ఉండడంతో ఈఎంటీ రవికుమార్ స్రవంతికి పురుడుపోయగా పాపకు జన్మనిచ్చింది.