భువనగిరి అర్బన్, జూలై 22: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే ఇంటింటా ఇన్నో వేటర్స్ కార్యక్రమంలో భాగంగా అన్ని రంగాల్లోని ప్రజల నుంచి ఆన్లై న్ ద్వారా ఇంటింటా ఇన్నో వేటర్స్ ఆవిష్కరణకు ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్తతి గురువారం ఓక ప్ర కటనలో పేర్కొన్నారు. మూడు సంవత్సరాలుగా వినూత్న సృజ నాత్మకత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేష న్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విభాగాల ద్వారా ప్రజ ల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ధరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని ఆ విష్కర్తలు వారు చేసిన ఆవిష్కరణలను ఫోన్ద్వారా 9100678543 నం బర్కు వాట్సప్ ద్వారా ఈనెల 25వ తేదీలోపు ధరఖాస్తులు పంపాలని కలెక్టర్ తెలిపారు. జి ల్లా ప్రజలు, విద్యావంతులు, వి ద్యార్థులు, గృహిణులు,వివిధ వృ త్తుల వారు ఎవరైనా ధరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఆవిష్కర ణలకు సంబంధించి ఆరు వాక్యా లు వారి ఆవిష్కరణలు వివరించే లా రెండు నిమిషాల నిడివి గల వీడియో ఆవిష్కరణ యొక్క నా లుగు ఫొటోలు ఆవిష్కరణ పేరు, వయస్సు, విద్యార్హత, వృత్తి, గ్రామం, మండలం, జిల్లా తదితర వివరాలు పంపాలని తెలి పారు. వచ్చిన ధరఖాస్తుల్లో ఐదు ఉత్తమ ఆవిష్కరణలు ఎంపి క చేసి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రద ర్శించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి భర ణికుమార్ను ఫోన్ నంబర్ 90009 8972 6లో సంప్రదించాలని తెలిపారు.