మోత్కూరు, జూలై 20: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలోని జంగాల కాలనీలో రూ.5లక్షలతో మంజూరు చేసిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల ఆశోక్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, వైస్ చైర్మన్ యాకుబ్రెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోంమల్లు, మున్సిపల్ కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, లెంకల సుజాత, యెర్రబెల్లి మల్లమ్మ, మాజీ సర్పంచ్ ఉమరాణి, మున్సిపల్ కమిషనర్ మహమూద్, ఏఈ వెంకటేశ్, నాయకులు బొడిగే శ్రీను, కె లింగయ్య, డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కందుల యాదగిరికి నివాళి
మోత్కూరు మున్సిపల్ పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల విక్రాంత్ తండ్రి యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మంగళవారం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందుల విక్రాంత్, కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.25 వేల ఆర్థికసాయం అందజేశారు.
అడ్డగూడూరు, జూలై 20 : అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని చౌళ్లరామారం గ్రామానికి చెందిన మత్స్యకారుడు బండారి నరేశ్ మరణించగా ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 2లక్షల చెక్కును సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి,ఎంపీపీ అంజయ్య,జడ్పీటీసీ జ్యోతిఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ మేఘారెడ్డి పాల్గొన్నారు.