అడ్డగూడూరు, జూలై 18: సీఎం కేసీఆర్తోనే వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మా రం గ్రామంలోని తన వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడు తూ మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ధర్మారం చెరువులో పూడిక తీయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండి అలుగు పోయడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. తాను కూడా తన పొలంలో నాట్లు వేస్తున్నట్లు తెలిపారు. ధర్మారం పక్కనే ఉన్న బిక్కేరు వాగు నుంచి నీరు వస్తుండటంతో బావులు, బోర్ల లో నీటి ఊట పెరిగిందన్నారు. ధర్మారం గ్రామానికి బిక్కేరు వాగులో చెక్డ్యాం మం జూరు చేసిన సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ కూలీలతో కలిసి ఆయన సంతోషంగా నాటు వేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మణాచారి, రాములు, అంజి, సైదులు తదితరులు పాల్గొన్నారు.