భువనగిరి అర్బన్, జూలై 27: జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదిక ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికతో పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కా ర్యాలయంలో మిషన్ భగీరథ, వ్యవసాయ, విద్యుత్, పంచా యతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమై రైతు వేది కల మౌలిక సౌకర్యాల కల్పనపై సమీక్షించారు. జిల్లాలో నిర్మా ణం చేపట్టిన 92 రైతు వేదికలను ఒక్కొక్కటి రూ.22లక్షలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. రైతు వేదికలకు సంబంధించిన విద్యు త్, నీటి కనెక్షన్లు ఇంకా పెండింగ్లో ఉండడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు సత్వరమే పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్న, చిన్న పనులన్నీ పెండింగ్లో ఉండడంతో ఆశించిన ప్ర యోజనం ఎలా నెరవేరుతుందని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే చాలాగడువు ఇచ్చామని, మిగిలిన పనులన్ని వారం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 4 రైతు వేదికలకు సంబం ధించి విద్యుత్ కనెక్షన్, 10రైతు వేదికలకు నీటి కనెక్షన్లను ఏ ర్పాటు చేయాల్సినవి పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వివ రించారు. సర్పంచ్లు సహకరించాలని, లేనిచో పంచాయతీ రాజ్, ఏఈలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో ని ర్మాణం చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణం, ప్రగతిపై సమీక్షిం చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, మిషన్ భగీరథ ఈఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.