సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాచకొండలో భోగినీ మండపంలోని రాతిగుండుపై 600 ఏండ్ల కిందట వేసిన సింగభూపాలుడి చిత్రం వెలుగుజూసింది. ఇది తెలంగాణ పూర్వ చరిత్రకు అరుదైన నిదర్శనమని చరిత్రకారుడు డాక్టర్ ధ్యావనపల్లి సత్యనారాయణ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇటీవల రాచకొండ వద్ద తాము జరిపిన పరిశోధనలో ఈ అరుదైన చిత్రాన్ని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. భోగినీ నాట్యమండపం, సింగభూపాలుడి చిత్రా ల గుర్తింపు, పూర్వచరిత్ర, పరిశోధనలో గుర్తించిన పలు అంశాలు ఆయన మాటల్లోనే..
ప్రభువుల నుంచి సామాన్యుల వరకు అందరినీ ఆకట్టుకునేది నాట్యకళ.. పూర్వకాలంలో ఈ నా ట్యకళలో నిష్ణాతులైన ఆడవారిని భోగినీలు అనే వారు.. వారు తమ నృత్యంతో అందరినీ అలరించేందుకుగాను 600 ఏండ్ల కిందట సర్వజ్ఞ సింగ భూపాలుడు అనే రాజు భోగినిని పోషించడమే కాకుండా ఆమె కోసం రాచకొండలో నాట్య మం డపం కట్టించి అందులో ఆమెతో నాట్య ప్రదర్శనలిప్పించారు.
ఇప్పుడున్న భోగినీ మండపం వెను క భాగంలో పద్మనాయక రాజుల బిరుదు గద్యం లో పేర్కొన్నట్లు సింగభూపాలుడు అశ్వరూడుడై విహరిస్తున్నట్లున్న రేఖా చిత్రముంది. బహుశా దా న్ని భోగినియే చెక్కించి ఉంటుందని భావిస్తు న్నాం. సింగభూపాలుడు నాట్యవిద్యను అధ్యయ నం చేసి ‘రసార్ణవ సుధాకరం’ అనే సులభ గ్రాహ్యనాట్య అలంకారశాస్త్ర గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. ఆ గ్రంథంలో భాగంగా లక్ష్య గ్రంథమైన ‘రత్నపాంచాలిక’ అనే నాటకాన్ని రచించాడు. సింగభూపాలుడు తన రచనలో అం తకుముందు అలంకారికులు వేశ్యను నాయికకు పనికి రాని సామాన్య స్త్రీ అని రాస్తే, ఆయన తన నాటకంలో దేవుడు నాయకుడైనప్పుడు అతడిని వరించే భోగినినాయకార్హత పొందుతుందని చె ప్పారు. తన రత్నపాంచాలిక నాటకంలో కువలయావళి అనే భోగిని కృష్ణుడ్ని పెళ్లాడిన నాయికగా చిత్రీంచారు. కాకతీయులుగాని, వారిముందు, వెనుక రాజులుగాని ప్రత్యేకంగా నాట్యశాలలు కట్టించినట్లు సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. రాచకొండ సింగభూపాలుడు ప్రత్యేకంగా నాట్య మండపాన్ని నిర్మించడం మన పూర్వ చరిత్రకు నిదర్శనమని ధ్యావనపల్లి సత్యనారాయణ వివరించారు.