బొమ్మలరామారం, జూలై 16: మండలంలోని రంగాపూర్లో మెరువు చెరువు కట్ట వద్ద మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయ డం కోసం అదనపు కలెక్టర్ దీపక్తివారీ శుక్రవారం చెరువు స్థ లాన్ని, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలను పరిశీలించారు. అనంతరం కంచల్ తండాలో జరిగిన పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మడలం లో మినీ ట్యాంక్ బాండ్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి నివేదిక అందిస్తానన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం వ హించొద్దన్నారు. పనుల్లో నాణ్యత పాటించి, త్వరితగతిన ప్రజ లకు అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్రెడ్డి, ఉప సర్పంచ్ గోపాల్రెడ్డి, ఎంపీడీవో సరిత, తహ సీల్దార్ పద్మసుందరి, కో ఆప్షన్ నెంబర్ జంగయ్య, ఆర్ఐ వెంక ట్రెడ్డి, వీఆర్వో రాములు, పీఆర్ఎఈ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.