బీబీనగర్, జూలై 23: పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ఫేమస్ ఫంక్షన్హాల్లో మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన 112 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు పోచంపల్లి పట్టుచీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకో వాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్, జడ్పీటీసీ ప్రణీతాపింగళ్రెడ్డి, రైతుబంధుసమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఎంపీడీవో శ్రీవాణి, తహసీల్దార్ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.