గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. మండలంలో చిన్న గ్రామంగా ఉన్న రామచంద్రాపురం ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు. పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలే మారిపోయా యి. గ్రామంలో డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతివనాల నిర్మాణాలను అతితక్కువ సమయంలోనే ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. మిషన్భగీరథ ద్వా రా నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. వీధులు సీసీరోడ్లతో దర్శనమిస్తున్నాయి. గ్రామాభివృద్ధికి సర్పంచ్ భువనగిరి శ్రీనివాస్తోపాటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, అధికారులు సహకరిస్తున్నారు. గ్రామంలో వైకుంఠధామం నిర్మించేందుకు స్థలం లేకపో వడంతో ప్రస్తుత సర్పంచ్ 20 గుంటల భూమిని పంచాయతీకి విరాళంగా ఇచ్చారు. గ్రామ పంచాయతీకున్న 10 గుంటల భూమితోపాటు సర్పంచ్ ఇచ్చిన 20 గుంటల భూమిలో వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన డంపింగ్యార్డు, పల్లెప్రకృతివనం, వైకుంఠధామలను ఇటీవల ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన సర్పం చ్ భువనగిరి శ్రీనివాస్ను అభినందించారు. గ్రామం చూడ ముచ్చటగా ఉందని, గ్రామంలో సీసీ రోడ్లు పూరైయ్యాయని, అతి చిన్న గ్రామాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దావని సర్పంచ్ను మెచ్చుకున్నారు.
గ్రామంలో జరిగిన అభివృద్ధి..
గ్రామంలో రూ.12.60లతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు రూ.9.14లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, రూ.1.60లక్షలతో పల్లెప్రకృతివనం, రూ.10లక్షలతో సీసీ రోడ్ల ఏర్పాటు, వాటర్ట్యాంక్ మరమ్మతులతోపాటు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. దీంతో గ్రామం అత్యంత సుందరంగా మారింది. హరితహారంలో భాగంగా ఇప్పటివరకు గ్రామంలో 4 వేలకు పైగా మొక్కలు నాటారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 8 వేల మొక్కలు ఉన్నాయి. పల్లెప్రకృతి వనంలో 14 రకాల మొక్కలు నాటడంతో ఏపుగా పెరుగుతున్నాయి. అదేవిధంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో వీధులన్నీ సుందరంగా మారాయి. సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు.
గ్రామ స్వరూపం..
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులు గ్రామంలోని ఎనిమిది మంది వార్డు సభ్యులు, గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 8 వార్డులుండగా 594 మంది జనాభా, 432 మంది ఓటర్లుగల అతి చిన్న గ్రామ పంచాయతీ.
చివరి మజిలీ తిప్పలు తీర్చేందుకే..
గ్రామంలో ఎవరైన మృతి చెందితే చివరి మజిలీలో తిప్పలు తీర్చడం కోసమే 20 గుం టల భూమిని పంచాయతీకి విరాళంగా ఇచ్చాను. గతంలో పంచాయతీకి చెందిన 10 గుంటల స్థలంలోనే గ్రామస్తులందరూ అంతిమ సంస్కారాలు చేసేవారు. ఆ స్థలం సరిపోక గ్రామస్తులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ భూమి పక్కనే ఉన్న మా భూమిని వైకుంఠధామానికి ఇవ్వాలనుకున్నా. ఈ క్రమంలో 2019లో సర్పంచ్గా ఏకగ్రీవం కావడంతో గ్రామస్తులకు సహకరించాలనే ఉద్దేశంతో 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చా ను. అందులోనే వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డును నిర్మించడం జరిగింది. ఈ పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి వసతులను చూసి సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు. గ్రామస్తులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధుల కృషితోనే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం.
-భువనగిరి శ్రీనివాస్, సర్పంచ్, రామచంద్రాపురం
మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
గ్రామస్తులకు మౌలిక వసతుల కల్పనే ధ్యే యంగా కృషి చేస్తున్నాం. తాగునీరు, వీధిలైట్లు, రహదారులు, పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యుల సహకారంతో కాలుష్యంలేని గ్రామంగా తీర్చడానికి మొక్కలు పెంచుతున్నాం. హరితహారంలో భాగంగా గ్రామంలో 4వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కలు అందజేసేందుకు నర్సరీలో 8వేల మొక్కలను పెంచుతున్నాం.
పల్లెప్రగతితోనే గ్రామాభివృద్ధి
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితోనే గ్రామం మరింత అభివృద్ధి చెందింది. మండలంలో అతి చిన్న గ్రామ పంచాయతీ రామచంద్రాపురం. పల్లెప్రగతిలో చేపట్టిన పనులతో గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ నిధులతో గ్రామంలో సీసీరోడ్లు, వైకుంఠధామం, డంపింగ్యార్డుతోపాటు ప్రజలకు మౌలిక వసతులను సర్పంచ్, వార్డు సభ్యులు కల్పించారు. – మైలారం బాలకృష్ణ, గ్రామస్తుడు