భువనగిరి అర్బన్, జూలై 23: జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన లు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్ట ర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం భువనగిరి ఏరియా ద వాఖానను తొలిసారి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందు తున్న వైద్య సేవల ను పరిశీలించారు. దవాఖానలోని ఆపరేషన్ థియేటర్, లేబర్రూం, కాన్పుల వార్డు, చిన్న పిల్లల వార్డు, ఐ సొలేషన్ వార్డును కలెక్టర్ పరిశీలించారు. దవాఖానలో నీటి స రఫరా పారిశుధ్య చర్యలను స్వయంగా పరిశీలించి, రోగులనూ అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో వైద్య సేవలను, టాయిలె ట్స్, పారిశుధ్య చర్యలు, నీటి సరఫరా విషయంలో రోగులతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. వైద్య సేవలు అందించడం లో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని అడిగారు. ద వాఖానలో సిటిజన్ చార్టర్ విధిగా ఏర్పాటు చేయాలని, దవా ఖానలోని టెస్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్లు, న ర్సులు ప్రత్యేకంగా ఆఫ్రాన్లు ధరించాలని ఆదేశించారు. యూని ఫాం లేకుంటే ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ పేరు ఫోన్ నంబర్ రోగులకు తెలిసేలా ప్రదర్శించాలని వై ద్య సిబ్బందికి సూచించారు. దవాఖానలో డోర్, విండో, కర్టెన్స్, డోర్ మాట్స్, కొత్తవి ఏర్పాటు చేసుకోవాలని, చిన్న చిన్న సమ స్యలను అధిగమించి పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చే యాలని సూచించారు.కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రకాశ్, ఆర్ఎంవో డాక్టర్ చందు, సిబ్బంది పాల్గొన్నారు.