సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ):వానలు దంచి కొడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాహనాలు అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. టైర్లు గ్రిప్ కోల్పోతుండటం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొన్ని ఘటనల్లో వాహనదారులు ప్రాణాలను కోల్పోతున్నారు. వర్షాకాలంలో వాహనాల టైర్ల నాణ్యత సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువని పలువురు మెకానిక్లు సూచిస్తున్నారు. పేలుతున్న టైర్లు.. రోడ్లపై జారుతున్న బండ్లపై వాహనదారులకు అవగాహన తక్కువని.. ఫలితంగా వాహనం కండీషన్ బాగున్నా డ్రైవ్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని వివరిస్తున్నారు.
చక్రాలు సాఫీగా తిరగాల్సిందే..
టైర్ల గ్రిప్ చెక్ చేసుకోవాలి..
కారు మోడల్.. వాటికి ఉన్న టైర్ల పరిణామాన్ని బట్టి గాలి నింపాలి. సాధారణంగా 32 పాయింట్ల గాలి నింపితే సరిపోతుంది. కొన్ని వాహనాల్లో ఒకటి రెండు పాయింట్లు ఎక్కువ తక్కువ ఉంటుంది. ఎక్కువ రోజులు ఒకే చోట పార్క్ చేసి ఉంచితే ఆ వాహనం లైఫ్పై దుష్ప్రభావం పడుతుంది. కారు ఎక్కువగా వాడే వారు దాని నిర్వహణపై శ్రద్ధ చూపాలి. కారును వాడని వారు కనీసం పది నుంచి 15 నిమిషాల పాటు స్టార్ట్ చేసి ఉంచాలి. ఇలా నెలకు ఒకటి రెండు సాైర్లెనా చేయాలి. వర్షాకాలంలో బ్రేకులు త్వరగా పాడైపోతాయి. టైర్లు బాగుంటేనే స్పీడ్ కంట్రోల్ చేయగలం. లేకపోతే బ్లాస్ట్ అవుతాయి.
-దీపేశ్ బజాజ్,మెకానిక్ షాప్ నిర్వాహకుడు
సమయానికి టైర్లను చెక్ చేయించాలి
లక్షలు ఖర్చు చేసి వాహనాలు కొంటున్నా వాటి నిర్వహణపై వాహన యజమానులు సరైన శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా టైర్లను అసలు పట్టించుకోవడం లేదు. తరచూ వీల్స్ చెక్ చేస్తూ నాణ్యత లేకపోతే మార్చుకోవాలి. తక్కువ ధరకు దొరుకుతున్న, కాలం చెల్లిన టైర్లను అస్సలు కొనుగోలు చేయవద్దు. వాహనం నిర్వహణ విషయంలో రాజీ పడొద్దు.
-నితిన్, వాహనదారుడు