బొమ్మలరామారం,ఆగస్టు 4: తల్లి పాలతోనే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ వడ్లకొండ అరుణ అన్నారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండ లంలోని మైలారంలోని అంగన్వాడీ సెంటర్లో బాలింతలకు, మహిళలకు తల్లి పాల అవశ్యకతపై బుధవారం అవగాహన స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి పాలను మించిన పౌష్టికాహారం లేదన్నారు. వదంతులు నమ్మకుండా పిల్లలకు తల్లి పాలు పట్టించాలని కోరారు. పిల్లల ఎదుగుదలకు బాలింతలు ఆకుకూరలతో పాటు, సమతుల్య ఆహారం తీసుకొవాలన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యు లు, అంగన్వాడీ టీచర్ సుల్తానా, ఎఎన్ఎం పావని, ఇంద్ర జ్యోతి, ఆశ వర్కర్ చంద్రకళ, గర్బిణులు పాల్గొన్నారు.
తల్లి పాలలో అనేక పోషకాలు
ఆలేరు టౌన్: తల్లిపాలలో అనేక పోషకాలు ఉంటాయని అం గన్వాడీ టీచర్ పద్మ అన్నారు. ఆలేరులోని అంగన్వాడీ సెంట ర్లో బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణు లు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ఆమె అవగాహన కల్పించారు. ప్రసవం అయిన గంట లోపే బిడ్డకు ముర్రు పాలు తాగించాలన్నారు. ముర్రుపాలల్లో రోగ నిరోధక శక్తి ఉంటుంద ని తల్లి పాలు సరిగ్గా అందకపోతే బిడ్డలు బలహీనంగా అవుతా రని, శిశు మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు.