యాదాద్రి: జిల్లాలోని ఓ ప్రముఖ కంపెనీలో 16 మంది బాల కార్మికులను అధికారులు గుర్తించారు. చౌటుప్పల్ మండలం దామరలో ఉన్న శ్రీవేంకటేశ్వర పరిశ్రమలో ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీలో 16 బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం వారిని ఎల్లగిరిలోని ప్రభుత్వ ఆశ్రమానికి తరలించనున్నారు. వారంతా ఒడిశాకు చెందినవారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బాలకార్మికులను పనిలో పెట్టుకున్నందుకుగాను పరిశ్రమ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.