రాజాపేట, జూలై 25: వందల ఏండ్ల పురాతన మెట్ల బావి నేటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తూ నాటి నాణ్యత, సాంకే తికతకు అద్దం పడుతున్నది.రాజాపేట మండలం బొందుగుల శివాలయ ఆవరణలో ఉన్న మెట్ల బావి( కోనేరు) నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించిన ఇలాం టి బావులు రాష్ట్రంలో అరుదుగా కనిపిస్తాయి. శివాలయ ఆవ రణలో ఉన్న మెట్ల బావిలో నాడు ఆలయానికి వచ్చే భక్తులు స్నానాలు అచరించి స్వామిని దర్శించుకొని పూజలు చేసేవారు.
మెట్ల బావి ప్రత్యేకత
శివాలయ ఆవరణలో మెట్ల బావి అద్భుతమైన నిర్మాణ కౌశ లంతో అలరారుతున్నది. మూడు గుంటల విస్తీర్ణంలో ఉండి, 20గజాల లోతుతో బావి చుట్టూ మెట్లు భక్తులు దిగడానికి వీ లుగా నిర్మాణం చేపట్టారు. బావిలోనే స్నానాలు ఆచరించిన భక్తులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు నిర్మించా రు. గదుల్లో శిల్పకళా దృశ్యాలు కనువిందు చేస్తాయి. బావిలో నడవడానికి అక్కడక్కడ ఖాళీ స్థలం వదిలి, చివరి వరకు వెళ్ల డానికి మూడు వైపులా మెట్లను నిర్మించారు. ఈ మెట్ల నిర్మా ణంలో పూర్తిగా సున్నంతో పాటు రాయిని వాడారు. శివాల య ప్రాంత వాసులు మెట్ల బావి నీటిని అవసరాల కోసం వి నియోగించుకునేవారు. అదేవిధంగా బావి నీటిని మోట దార్ల ద్వారా వరి సాగుకు వినియోగించేవారని పెద్దలు చెప్తుంటారు.
నాటి చరిత్రకు సజీవ సాక్ష్యం
గ్రామ శివాలయం ఆవరణలో ఉన్న వందల ఏండ్ల నాటి పురాతన మెట్ల బావి నేటికి చెక్కు చెదరకుండా ఉం ది. ఈ బావి నాటి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు పంటల సాగుకు నీరందించేదని గ్రామ పెద్దలు ఇప్పటికీ చెప్తుంటారు. వందల ఏండ్ల చరిత్రకు ఈ బావి సజీవ సాక్ష్యంగా ఉంది. ఇలాంటి బావులను సంర క్షించి మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవాలి.
– కిశోర్, శివాలయ అర్చకుడు, బొందుగుల