యాదాద్రి, జూలై22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ మం డపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, స్వామి వారి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం కొండపై ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలు స్తూ కుంకుమార్చన జరిపారు. కొండకింద భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి.
స్వామివారి ఖజానాకు రూ. 4,25,987 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ. 4,25,987 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ.30,966, రూ.100 దర్శనంతో రూ. 1,600, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 31,200, క్యారీబ్యాగులతో రూ. 1,500, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 7,500, కల్యాణకట్టతో రూ. 7,800, ప్రసా ద విక్రయంతో రూ. 1,80,725, శాశ్వత పూజల ద్వారా రూ. 8,232, వాహనపూజలతో రూ. 8,300, టోల్గేట్తో రూ. 220, అన్నదాన విరాళంతో 14,464, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 84,980, యాదరుషి నిలయం తో రూ. 26,600, పాతగుట్టతో రూ. 9,900, టెంకాయల విక్రయాలతో రూ. 12,000తో కలుపుకొని రూ. 4,25,987 ఆదా యం సమకూరినట్లు ఆమె తెలిపారు.