ఆత్మకూరు(ఎం), జూలై16: ఫైలేరియా, నులి పురుగుల నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేసిన మాత్రల ను శుక్రవారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ప్రభు త్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న మాత్రలను ప్రతి ఒక్కరూ వేసుకోవాలని మండల వైద్యాధికారి ప్రణీష అన్నారు. కార్య క్రమంలో పారుపల్లి సర్పంచ్ రమేశ్గౌడ్, ఆరోగ్య కార్యకర్త లు ధనలక్ష్మి, సునీత, ఆశ కార్యకర్త షాహీన్ పాల్గొన్నారు.
మోటకొండూర్ మండలంలో
నులిపురుగుల నివారణ కోసం మండలం లోని అన్ని గ్రామాల్లో శుక్రవారం మండల వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి అల్బెండజో ల్ మాత్రలు పంపిణీ చేశారు. రెండో రోజు 9,301 మందికి మాత్రలు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి రాజేందర్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్లు, వైద్య సిబ్బంది, ఆశలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.