భువనగిరి అర్బన్, జూలై 22: సీఎం కేసీఆర్ గొల్ల కురుమలకు రెండో విడుత గొర్రెల పంపిణీకోసం రూ.6 వేల కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ గురువారం భువనగిరి జడ్పీటీసీ బీరుమల్లయ్య, మండల గొల్ల,కురుమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలోని రహదారి బంగ్లా సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బీరుమల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని కులవృత్తుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షే మ పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. కులవృత్తుల సంక్షేమానికి కృషి చేస్తున్న మొదటి సీఎంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని మరువలేమన్నారు. సీఎం కేసీఆర్కు కులవృత్తుల కుటుంబాలు రుణపడి ఉంటాయన్నారు. కార్యక్రమంలో నాయకులు పుట్ట వీరేశ్యాదవ్, నక్కల చిరంజీవి యాదవ్, సతీశ్, బండి మల్లేశ్, వెంకటేశ్, సురేశ్, శ్రీశైలం, మల్లేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేపట్టడంతోపాటు గొర్రెల యూనిట్లకు అదనంగా రూ.50వేలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గురువారం మండలంలోని లింగరాజుపల్లిలో గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొర్ల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు దుర్గం యాదమల్లు మాట్లాడుతూ ఉచితంగా పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్కు రూ.లక్షా 25 వేలు గతంలో చెల్లించగా ప్రస్తుతం మరో రూ. 50వేలు పెంచి ఒక్కో యూనిట్కు రూ.లక్షా75వేలు అందివ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, మధు, స్వామి, మల్లయ్య, నాగరాజు, సావిత్రమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.