రోజూ ఏదో ఒక పండు తినడం వల్ల నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకొచ్చు. అయితే ఎప్పుడు ఏ పండు తినాలన్న దానిపై అవగాహన అవసరం
పండ్లలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. కాబట్టి నిరభ్యంతరంగా ఆరగించవచ్చు.
రోజూ రెండు పండ్లు తినాల్సిందే అన్న నియమం పెట్టుకోవాలి. దీనివల్ల చర్మానికి నిగారింపు వస్తుంది.
Budget
Skin care
మధుమేహానికి దూరంగా ఉండవచ్చు. బ్రేక్ఫాస్ట్గా పండ్లను ఎంచుకుంటే మరీ ఉత్తమం.
పండ్లు+కొబ్బరి, పండ్లు+మొలకెత్తిన గింజలు, పండ్లు+పనీర్.. కూడా మంచి కాంబినేషన్లే.
పండ్లను పాలతోనూ తీసుకోవచ్చు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రం.. సాధారణ పాలతో పోలిస్తే ఆల్మండ్ మిల్క్ ఉత్తమం.
ఎంత ఖరీదైనవి అయినా, ఎన్ని పోషకాలున్నా విదేశీ పండ్లు విదేశీ పండ్లే. స్థానిక ఫలాలను ఎంచుకోవడమే ఉత్తమం.
డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. కానీ, పండ్లరసం రూపంలో తీసుకుంటే మాత్రం ఈ అమూల్యమైన పోషక శక్తిని కోల్పోతాం.
మితిమీరి తినడం అంత మంచిది కాదు. వీటిలోని ఫ్రక్టోజ్ ఊబకాయానికి ఓ కారణం కావచ్చు. కాబట్టి, రెండు పండ్లకు పరిమితమైతే ఉత్తమం.