2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. ఇండస్ట్రీకి వచ్చి రాగానే వరుస ఆఫర్లు అందుకున్నప్పటికీ.. టాప్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది.
పైగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తప్పితే మరే స్టార్ హీరోతో నటించలేదు. కేవలం టైర్ 2 హీరోలతోనే సినిమాలు చేసింది.
అలా అని ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రాలేదని కాదు.. పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా పలు కారణాలతో తప్పుకోవాల్సి వచ్చిందట.
మరి ఈ ఎనిమిదేళ్ల సినీ ప్రస్థానంలో రాశీఖన్నా మిస్ చేసుకున్న సినిమాలేంటో ఒకసారి లుక్కేద్దాం..
సర్కారు వారి పాట సినిమాకు డైరెక్టర్ పరశురామ్ ఫస్ట్ రాశీఖన్నానే అనుకున్నాడట. కానీ పెద్ద హీరోయిన్ అయితే బాగుంటుందని నిర్మాతలు అనడంతో ఆ ఛాన్స్ కీర్తి సురేశ్కు దక్కింది.
శింబు హీరోగా వచ్చిన మానాడు సినిమా కోసం ముందుగా రాశీ ఖన్నానే సంప్రదించారు. కానీ కొన్ని కారణాలతో ఆ ఆఫర్ కళ్యాణి ప్రియదర్శన్కు వెళ్లింది.
టక్ జగదీష్ సినిమా ఆఫర్ ముందు రాశీ ఖన్నాకే వచ్చింది. కానీ హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేకపోవడంతో రిజెక్ట్ చేసిందట.
ఎఫ్ 2 మూవీలో హనీ పాత్రకు అనిల్ రావిపూడి ముందుగా రాశీ ఖన్నానే సంప్రదించాడట. కానీ ఆమె నో చెప్పడంతో మెహ్రీన్కు ఛాన్స్ వచ్చింది.
రష్మిక మంధనకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన గీతాగోవిందం సినిమా క్యారెక్టర్ కూడా ముందుగా రాశీ ఖన్నాకే వచ్చింది.
కానీ అప్పటికి అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కాలేదు. విజయ్ దేవరకొండకు అంత క్రేజ్ లేదు. దీంతో గీతాగోవిందం సినిమాలో నటించేందుకు రాశీ ఖన్నా ఒప్పుకోలేదట.
ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలను రాశీ ఖన్నా మిస్ చేసుకుందని.. అవి గనుక చేసి ఉంటే స్టార్ స్టేటస్ దక్కేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.