#Priya Anand
ఈమె నటించిన సినిమాలు ఆకట్టుకున్నప్పటికీ.. టాలీవుడ్లో ఈమెకు అంతగా గుర్తింపు దక్కలేదు.
కో అంటే కోటి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది ప్రియా ఆనంద్. కోలీవుడ్కే పరిమితమైంది.
ఈ సందర్భంగా ప్రమోషన్లో బిజీగా ఉన్న ప్రియా ఆనంద్.. వివాదాస్పద స్వామిజీ నిత్యానందపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నిత్యానంద సూక్తులను సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి కారణమేంటని మీడియా అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చింది.
తనకు నిత్యానంద అంటే ఇష్టం. ఎంతమంది విమర్శించినప్పటికీ.. ఆయన్ను చూడటానికి వేలాదిమంది ఆసక్తిచూపిస్తారని తెలిపింది.
ఒక్కోసారి ఆయన క్రేజ్ చూస్తే షాకింగ్గా అనిపిస్తుందని.. అన్ని కుదిరితే ఆయన్ను పెండ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది.
నిత్యానందతో పెండ్లి జరిగితే తన పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని.. ఇద్దరి పేర్లు ఇంచుమించు ఒకేలా ఉంటాయని సరదాగా చెప్పుకొచ్చింది.