సినీ ఇండస్ట్రీలో మరో సెలబ్రెటీ జంట పెళ్లి పీటలు ఎక్కింది. ఆది పినిశెట్టి, నిక్కి గల్రానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఆది పినిశెట్టి, నిక్కి గల్రానీ ఇద్దరూ ‘యాగవరైనమ్ నా కక్కా’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా 2015లో మలుపు పేరుతో తెలుగులో కూడా విడుదలైంది.
మలుపు సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మరకత మణి సినిమాలోనూ నటించారు.
తమ ప్రేమ విషయాన్ని దాదాపు రెండేండ్లకు పైగా వీళ్లు సీక్రెట్గా ఉంచారు. అయినప్పటికీ ఇది బయటకు పొక్కింది.
Aadhi Pinishetty
వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో తమ లవ్ గురించి అటు ఆది.. ఇటు నిక్కి గల్రానీ ఇద్దరూ కన్ఫర్మ్ చేశారు.
Nikki Galrani
ఇరు కుటుంబాల సమక్షంలో మార్చి 24నే వీరి నిశ్చితార్థం చేసుకుని.. రెండు రోజుల తర్వాత ఆ ఫొటోలను పంచుకున్నారు.
తాజాగా ఆది పినిశెట్టి, నిక్కి గల్రానీ ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కారు. ప్రస్తుతం వీళ్ల పెండ్లి ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.