Sai pallavi
రీసెంట్గా విరాట పర్వం సినిమాతో ఆకట్టుకున్న సాయిపల్లవి.. తాజాగా చిట్ చాట్ సెషన్లో పాల్గొంది.
ఈ చిట్ చాట్లో ప్రేమ గురించి.. ఎలాంటి అబ్బాయిలు ఇష్టమో చెప్పుకొచ్చింది.
సున్నిత మనస్సున్న అబ్బాయిలంటే తనకు ఇష్టమని.. అలాంటి వాళ్లు ఏదైనా చెప్తే వినేందుకు ఇష్టపడతానని మనసులో మాట బయటపెట్టింది.
అమ్మాయిలను నొప్పించొద్దని.. త్యాగాలు చేసే అబ్బాయిలంటే కూడా తనకిష్టమని తెలిపింది సాయిపల్లవి.
ఓ అబ్బాయి చూడటానికి ఫిట్ కనిపిస్తే చాలని.. బాడీ బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
అందరిలాగా గులాబీ పువ్వు చేతిలో పెట్టడం, రింగ్స్ పెట్టి ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదని.. మంచి మనస్సు ఉంటే చాలని చెప్పుకొచ్చింది.
మొత్తానికి తనకు కాబోయే వాడు ఎలాంటి వాడై ఉండాలో క్లారిటీ ఇచ్చేసి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది సాయిపల్లవి.