గుడ్బై సినిమాపై రష్మిక మంధన చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్లో సెటిల్ అవ్వాలని అనుకుంది.
కానీ గుడ్బై సినిమా థియేటర్లలో అంతగా సక్సెస్ కాలేదు.
ఇక రెండో సినిమా మిషన్ మజ్నుతో అయినా బాలీవుడ్లో పాగా వేయాలని భావించింది రష్మిక.
చూస్తుంటే ఈసారి కూడా రష్మిక కోరిక నేరవేరేలా కనిపించడం లేదు.
ఇప్పుడు మిషన్ మజ్ను సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
జనవరి 20 నుంచి నెట్ఫ్లిక్స్లో మిషన్ మజ్ను సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో రిలీజ్కావడం రష్మిక బాలీవుడ్ కెరీర్కు మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.