యంగ్ హీరోతో కోలీవుడ్ భామ పెండ్లి
కోలీవుడ్ యువ జంట గౌతమ్, మంజిమా మోహన్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో చెన్నైలో గౌతమ్, మంజిమా పెండ్లి ఘనంగా జరిగింది.
వీరి వివాహానికి మణిరత్నం, గౌతమ్ మీనన్, వెంకట్ ప్రభు, ఐశ్వర్య రజినీకాంత్, శివ కార్తికేయన్ పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.
కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టడం పట్ల అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న ఈ జోడీకి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.
2019లో దేవరత్తం అనే సినిమాలో గౌతమ్, మంజిమా కలిసి నటించారు.
ఆ సినిమా టైమ్లో ఏర్పడిన పరిచయం తొలుత స్నేహంగా. ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇ టీవల మంజిమా మోహన్ ప్రకటించింది.
మూడేళ్ల క్రితం నా లైఫ్లో అడుగుపెట్టావు. జీవితాన్ని ఎలా చూడాలో నేర్పించావు. అని సోషల్మీడియాలో పేర్కొంది.
దిక్కుతోచని పరిస్థితులు ఎదురైనా ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చావు అని తెలిపింది.
నాలోని లోపాలను అంగీకరించి.. నాలో నేను ఉండాలని నేర్పించావు.. నాపై కురిపించే ప్రేమ వల్లే నీపై కొండంత ప్రేమను పెంచుకున్నా అని రాసుకొచ్చింది.
నాగచైతన్యతో కలిసి సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో మంజిమా టాలీవుడ్కు పరిచయమైంది.
ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్కు దూరమైంది. కోలీవుడ్లో సెటిలైంది.
అన్నట్టు ఈ కోలీవుడ్ హీరో ఎవరో కాదండీ.. సీతాకోక చిలుక, అన్వేషణ, అభినందన వంటి సినిమాలతో ఆకట్టుకున్న కార్తిక్ కొడుకే గౌతమ్.
కార్తిక్ వారసుడిగా కడలి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. కోలీవుడ్లో మంచి పేరే తెచ్చుకున్నాడు.