#Keerthy suresh
#Keerthy suresh
ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథలపై ఫోకస్ చేసిన కీర్తి.. ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నది.
అందుకే చాలా గ్యాప్ తర్వాత కమర్షియల్ సినిమాతో వస్తుంది.
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమాపైనే ఆమె ఆశలు ఉన్నాయి.
ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న కీర్తి.. ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
ఓ సాంగ్ షూటింగ్ సమయంలో టైమింగ్ కోల్పోయి.. స్టెప్పులు మరిచిపోయానని గుర్తు చేసుకుంది కీర్తి సురేశ్.
ఆ సమయంలో స్టెప్పులు వేస్తూ టైమింగ్ మిస్సయి మహేశ్ను రెండుసార్లు కొట్టానని రివీల్ చేసింది.
ఆ తర్వాత సారీ కూడా చెప్పానని.. కానీ పొరపాటున మళ్లీ మహేశ్ను కొట్టానని చెప్పింది.
దీంతో నాపై ఏమైనా కోపం ఉందా అంటూ మహేశ్బాబు అడిగాడని గుర్తు చేసుకుంది.
మహేశ్బాబుతో షూటింగ్ చేయడం సరదాగా ఉంటుందని పేర్కొంది.